AP Assembly Sessions : పత్తి, ధాన్యం, పామాయిల్ తో...టీడీపీ నిరసన..

Dec 10, 2019, 11:10 AM IST

రాష్ట్రంలో రైతు సమస్యలపై అసెంబ్లీ భయట టీడీపీ నిరసన చేపట్టింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అసెంబ్లీ బయట ధాన్యం, పత్తి, పామాయిల్ గెలలతో వినూత్న రీతిలో తెలుగుదేశం నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.