నారా లోకేష్ కు కర్నూలు టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం

Jun 15, 2020, 10:18 AM IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ కు కర్నూలు టోల్ గేట్ వద్ద జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వారిని సాదరంగా పలకరించిన లోకేష్ కాసేపటి తరువాత అక్కడి నుండి అనంతపురానికి బయల్దేరాడు.  వాహనాల కొనుగోలు ఆరోపణలపై అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేష్ అనంతపురం బయలుదేరారు. కరోనా కరోనా కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని జైలులో కలిసే అవకాశం లేకపోవడంతో నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన అనంతపురానికి బయలుదేరారు.