చంద్రబాబు నిర్బంధం... ఎన్టీఆర్ భవన్ వద్ద టిడిపి సీనియర్ల ధర్నా

Mar 1, 2021, 3:04 PM IST

అమరావతి: రేణిగుంట విమానాశ్రయంలో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ టిడిపి నాయకులు ధర్నాకు దిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద  టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆందబాబు, టీడీ జనార్థన్, అశోక్ బాబు, మద్దిపాటి వెంకటరాజు, గన్ని కృష్ణా, పిల్లి మాణిక్యరావు, గంజి చిరంజీవి, సయ్యద్ రఫీ, బుచ్చిరాంప్రసాద్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, వేమూరి ఆనంద్ సూర్య, దారపనేని నరేంద్ర, వల్లూరు కుమారస్వామితో పాటు టిడిపి కార్యకర్తలు నిరసనకు దిగారు.