ఏపీ అసెంబ్లీ సమావేశాలు : ఓ వైపు ముందస్తు అరెస్టులు...మరోవైపు నిరసనలు...

Jan 20, 2020, 11:02 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గుంటూరు మాజీ మంత్రి ఆలపాటి రాజా, టిడిపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మ్యానీలను అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్ కు తరలించారు. గుంటూరులో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి యువజన జెఏ సి నాయకులు రావిపాటి సాయి, మహంకాళి సుబ్బారావు, బట్టగిరివెంకటేస్వరెడ్డి, షేక్ జిలాని తథితరులను బృందావన్ గార్డెన్స్లో    అరెస్టుచేశారు. అరెస్టులకు నిరసనగా విద్యార్థి యువజన జెఏసి నాయకులు నల్ల బెలూన్లు గాలిలోకి ఎగరవేశారు.