May 12, 2020, 3:05 PM IST
మద్యం అమ్మకాలపై నిరసనగా తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విశాఖపట్నం టీడీపీ పార్టీ ఆఫీసులో నిరసన తెలిపారు. మద్యం సీసాలు పగలగొడుతున్న వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం
ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు మహిళలతో కలిసి 12 గంటలు నిరసన దీక్ష చేస్తున్నారు. వైసిపి ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఈ రాష్టంలో మద్యపాన నిషేదం జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.