Dec 3, 2019, 11:32 AM IST
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కర్నూలు జిల్లా శ్రీశైలంమహా క్షేత్రం చేరుకున్నారు. శారదా పీఠ సత్ర సముదాయం వద్ద శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావులు ఆయనకు ఘనంగా ఆహ్వానం పలికారు. మంగళవారం ఉదయం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను పీఠాధిపతులు దర్శించుకున్నారు.