ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు.. పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి...

May 4, 2020, 12:43 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలసకూలీల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ స్వస్థలాలకు పంపించాలంటూ కొవ్వూరు ప్రధాన రహదారిపైకి ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ ,ఒడిశాకు చెందిన 300 మందికిపైగా వలస కూలీలు చేరి ధర్నా చేపట్టారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేంత వరకూ పంపించలేమని పోలీసులు చెప్పడంతోవలస కూలీలు రాళ్లు, సీసాలతో దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. వీరంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పని చేస్తున్నారు.