పోస్టుమార్టం చేయడం లేదంటూ..జాతీయ రహదారిపై...

Feb 18, 2020, 4:34 PM IST

కృష్ణ జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు. నిన్న పోలవరం కాల్వలో మృతి చెందిన ఇద్దరు యువకులకు పోస్టుమార్టం చేయడంలేదంటూ ధర్నాకు దిగారు. డాక్టర్లను అడిగితే పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన కారణంగా భారీ గా ట్రాఫిక్ జాం అయ్యింది.