డోన్ లో వింత.. ఇంటిముందు కూర్చుని దగ్గిందని.. మహిళపై దాడి..

Jul 1, 2020, 1:31 PM IST

కర్నూలులోని డోన్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు వివాదాలకు కారణమవుతున్నాయి. కొండపేట ప్రాంతంలో ఓ పాజిటివ్ కేసు రావడంతో జనాలు ఇంట్లోనుండి బైటికి రావడానికి వణికిపోతున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ కేసు ఇంటిపక్కనున్న మహిళ బంధువుల ఇంటికి వెడదామని బయల్దేరింది. కొద్దిదూరం నడిచాక, కాసేపు అలుపు తీర్చుకోవడానికి ఓ ఇంటి దగ్గర కూర్చుని దగ్గింది. అంతే స్థానికులు ఆమెతో వాదనకు దిగారు. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.