జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరింది.. నిమ్మకాయల చినరాజప్ప

Jun 25, 2020, 3:40 PM IST

టీడీపీ నేత అచ్చెన్నాయుడిని నిన్న అర్థరాత్రి ఆసుపత్రినుండి డిశ్చార్జ్ చేయించి అరెస్టు చేయించాలని చూడడం అమానుషం అని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరిందని, టీడీపీ నేతలను అరెస్టులు చేయాలని కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి జగన్ కోర్టులను కూడా లెక్కచేయడని అన్నారు. అందర్నీ ఏడిపించాలని చూస్తున్నాడని, జగన్ అర్థం చేసుకోవాలని అన్నారు.