ప్రభుత్వం సహకరించాలి... నిమ్మగడ్డ రమేష్ కుమార్

Aug 3, 2020, 12:40 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి సోమవారం విజయవాడలో తన బాధ్యత లు స్వీకరించాడు. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని, రాగద్వేషాలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆర్డినెన్సులు, మధ్యలో మరో కొత్త కమీషనర్, న్యాయపోరాటాల తరువాత ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో చేరారు