అమరావతి : గుండెపోటుతో టీడీపీ నాయకుడు మృతి...

Jan 29, 2020, 8:34 AM IST

40 రోజుల పాటు జై అమరావతి ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున పోరాడిన మంగళగిరి మండలం నవులూరు గోలివారితోటకు చెందిన టీడీపీ నాయకులు రంగిశెట్టి వెంకటేశ్వరరావు ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. రంగిశెట్టి వెంకటేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి ఇద్దరు కుమారుల చదువుకి పార్టీ తరపున సహాయం అందిస్తాం అని లోకేష్ భరోసా ఇచ్చారు.