Jan 20, 2020, 6:16 PM IST
అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టైన రైతులను అమరావతి పోలీస్ స్టేషన్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసారని, మహిళల్ని కూడా కొట్టారని, లాఠీ ఛార్జ్ లో రైతులు గాయపడ్డారని రైతులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు అధైర్య పడొద్దని మీ తరపున మేము పోరాడతాం అని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం అమరావతి పోలీస్ స్టేషన్ నుండి రైతులను పోలీసులు విడుదల చేసారు.