వైసిపి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి... నివాళి అర్పించిన ఎంపీ విజయసాయి

Apr 14, 2021, 3:56 PM IST

విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విజయసాయి రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎంపీ. అనంతరం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గురించి విజయసాయి రెడ్డి ప్రసంగించారు.