దోచుకున్న సొమ్ముతోనే ఎన్నికల్లో పోటీ..దేవినేని ఉమపై వసంతకృష్ణప్రసాద్ ఫైర్...

Mar 9, 2020, 10:43 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమా మంత్రి గా దోచుకున్న సొమ్ము తో స్దానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని,పదేళ్ళ ఉమా పాలన 10 నెలలు నా పాలన ప్రజలు గమనిస్తున్నారని, ఉమాకు మరోసారి మైలవరం నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారన్నారు.