ఏపీలో టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కానీ.. ఆదిమూలపు సురేష్..

Jun 15, 2020, 5:06 PM IST

విజయవాడ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యా శాఖాధికారులతో మంత్రి  ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు దృష్ట్యా అన్ని సెంటర్లలో పకడ్భంది చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కోరూం లో పది నుంచి 12 మంది కి మించకుండా‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, హెల్త్ అధికారులను పరీక్షా ‌కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న పరిక్షా కెంద్రాలను మరోచోటికి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.  కంటైన్ మెంట్ జోన్ల లో ఉన్న  విద్యార్ధులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని, అన్ని చోట్లా ఏర్పాట్లు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు.