సోనూసూద్ ఇచ్చిన ట్రాక్టర్‌తో.. వ్యవసాయం మొదలుపెట్టిన మదనపల్లె రైతు..

Jul 27, 2020, 4:43 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె రైతు నాగేశ్వరరావు ట్రాక్టర్‌తో వ్యవసాయం ప్రారంభించారు. సోమవారం ఉదయం తన కూతుళ్లను ట్రాక్టర్‌పై కూర్చోబెట్టుకుని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తమ కష్టాలను తీర్చిన రియల్ హీరో అంటూ సోనూ సూద్‌‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన, కుటుంబం చల్లగా ఉండాలని ఆకాంక్షించింది. తమ కష్టాలు చూసి స్పదించి సాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజువల్స్ తీయడం కోసం సోనూసూద్ స్నేహితులు ప్రత్యేకంగా బెంగళూరు నుండి చిత్తూరుకు వచ్చారు.