కృష్ణాజిల్లాలో భారీగా పట్టుబడ్డ బంగారం

Jun 1, 2020, 10:46 AM IST

కృష్ణాజిల్లా, తిరువూరు లోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం, నగదు పట్టుబడ్డాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న లక్షల విలువైన బంగారం, వెండి, నగదును నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. కిలో 53 గ్రా. బంగారం, తొమ్మిది కొలోల వెండి, 53లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  మొత్తం పట్టుబడిన నగదు, బంగారం విలువ కోటి, ముప్పై ఏడు లక్షల, 65, వేల 975 రూపాయల విలువైనదిగా డీఎస్పీ తెలిపారు.