శారీరకంగా వాడుకుని వదిలేసిన బావ... కృష్ణా జిల్లాలో యువతి న్యాయపోరాటం

Dec 2, 2022, 5:02 PM IST

మచిలీపట్నం : సొంత బావే ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతో యువతి కూడా అంగీకరించింది. రెండేళ్లు బావామరదళ్లు ప్రేమలో మునిగితేలారు. ఎలాగే పెళ్లిచేసుకుంటాం కదా అని యువతి శారీరకంగానూ బావకు దగ్గరయ్యింది. అయితే కోరిక తీరాక సదరు బావ బుద్ది మారింది. ఇన్నాళ్లు ప్రేమించిన మరదలిని కాదని పెద్దలు కుదిర్చిన మరో యువతితో పెళ్లికి సిద్దమవగా దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యడ్ల దిలీప్ కుమార్ మరదలి వరసయ్యే కనకదుర్గా భవాని ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరదలితో శారీరకంగా దగ్గరయ్యాడు దిలీప్. తీరా కుటుంబసభ్యులు మరో యువతితో పెళ్ళి నిశ్చయించగా తన ప్రేమ విషయం బయటపెట్టకుండా అందుకు సిద్దమయ్యాడు. దీంతో దుర్గాభవాని మోసపోయినట్లు గ్రహించి న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.