Feb 12, 2020, 3:02 PM IST
57 వ రోజు కూడా అమరావతిని తరలించవద్దు అని గ్రామాలలో రైతులు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మేడారం, తిరుపతికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మరో 2000ల మంది రైతులు షిరిడి బయలు దేరారు. మహిళా రైతులు గోరెంటాకుతో చేతులపై సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని వేసుకుని నిరసన తెలిపారు.