ఇదో కొత్తరకం మోసం... చందర్లపాడులో నకిలీ తూనికలు, కొలతల అధికారుల దాడులు

Mar 22, 2021, 8:42 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులమంటూ కొన్ని షాపులలో డబ్బులు దండుకోంది ఓ ముఠా. పట్టణంలోని ఆదిత్య కిరాణా షాపు, ఒక స్వీట్ హౌస్ తో పాటు మరికొన్ని చిల్లర దుకాణాలపై తూనికల కొలతల శాఖ అధికారులమంటూ నకిలీ బిల్లులు ఇచ్చి డబ్బులు దండుకంటున్నారు. ముగ్గురు వ్యక్తులు సివిల్ డ్రెస్ లలో వచ్చి తూనికల కొలతల అధికారులం మంటూ ఎలక్ట్రానిక్ కాటాలకు ముద్రలు వేసే గడువు అయిపోయింది కాబట్టి డబ్బులు కట్టాలంటూ ఒక్కొక్కరికి రూ.1200 రూపాయలకు బిల్లులు ఇస్తూ మూడు నాలుగు దుకాణాలలో డబ్బులు వసూలు చేశారు.