ఏమైందో.. భార్యా పిల్లలు వచ్చేసరికే...

May 15, 2020, 6:23 PM IST

విశాఖపట్నంలోని అప్పుఘర్ సమీపంలో బీచ్ రోయల్  అపార్ట్ మెంట్ లో డిఎస్పీ కృష్ణ వర్మ( స్పెషల్ బ్రాంచ్) (శ్రీకాకుళం), (89 బ్యాచ్), అనుమానస్పదస్థితిలో మరణించారు. 1989వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కృష్ణ వర్మ శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు బయటికు వెళ్లి వచ్చేలోగా ఈ ఘటన జరిగిందని, గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారని ఎంవిపి పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు..