పోతిరెడ్డి పాడును వివాదం చేస్తే రెండు రాష్ట్రాలూ నష్టపోతాయి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

May 12, 2020, 5:54 PM IST

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులరేటర్ వివాదం మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లేనందున వివాదం చేస్తే ఇరు రాష్ట్రాలూ నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. జగన్, కేసీఆర్ ల మధ్య చక్కటి అవగాహన ఉన్నందున కూర్చుని, మాట్లాడుకుని, పరిష్కరించుకోవాలని తెలిపారు.