
అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనలో వేగం, పారదర్శకత, ప్రజలకు సేవల త్వరిత పంపిణీనే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధి పనుల అమలు, సంక్షేమ పథకాల డెలివరీలో ఆలస్యం లేకుండా పని చేయాలని కలెక్టర్లకు సూచించారు.