Sep 18, 2020, 12:43 PM IST
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమరావతికి పిలుపునిచ్చారు. దీంతో బిజెపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం అమలాపురం చేరుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని పోలీసుుల ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టైన ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్ రెడ్డిల సమాచారం తెలియకపోవడంతో పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు ఆదోంళన చెందుతున్నారు.