Sakala Janula Samme : సకల జన్నుల సమ్మెకు దిగిన అమరావతి రైతులు

Jan 3, 2020, 10:49 AM IST

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లోని 29 గ్రామాల ప్రజలు శుక్రవారం నుంచి సకల జనుల సమ్మెకు దిగారు. తుళ్లూరు, మందడంలో దుకాణాలు తెరుచుకోలేదు.  కొంతమంది తెరిచిన వాటిని బలవంతంగా మూసేయించారు. రహదారులు బోసిపోయాయి. హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, పాల ఉత్పత్తులు లాంటి నిత్యావసరాలకు సమ్మెలో మినహాయింపునిచ్చారు. తుళ్ళూరులో తెరచివున్న దుకాణాలను మూసివేయాలి అంటూ రైతు పరిరక్షణా సమితి సభ్యులు పిలుపునిచ్చారు.