70సార్లు కోర్టు మొట్టికాయలు.. సిగ్గుంటే జగన్ రాజీనామా చేయాలి.. అయ్యన్నపాత్రుడు

Jun 11, 2020, 5:34 PM IST

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోంది. గూండాలు ప్రజల్ని పాలన చేస్తున్నారు. విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీస్ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు కళ్లు మూసుకున్న సమయంలో.. న్యాయస్థానాల వ్యాఖ్యలు ప్రజలకు భరోసాను కల్పిస్తున్నాయి. న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు రాష్ట్ర ప్రజానీకంలో ధైర్యాన్ని నింపుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు అయ్యన్నపాత్రుడు.