పోలవరం రాక్‌ ఫిల్ డ్యామ్‌లో గ్యాప్‌ 3కి శంకుస్థాపన

Feb 2, 2020, 3:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌‌కు సంబంధించి రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్ 3 పనులకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్పిల్ వే, స్పిల్ ఛానెల్ నిర్మాణ పనులను పరిశీలించారు.