వాడిన యూనిట్లకే బిల్లు.. కరెంటు బిల్లులపై క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి..

May 14, 2020, 7:34 PM IST

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.కరంట్ బిల్స్ ఎక్కువగా వస్తున్నాయనే అంశాలపై చర్చించి, బిల్లుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హోమ్ మినిస్టర్ ఆరా తీశారు. మీటర్ రీడింగ్ లను స్కానింగ్ పద్దతిలో తీయడం వలన మానవతప్పిదాలకు తావులేదని హోమ్ మినిస్టర్ అన్నారు. మార్చ్ నెల పవర్ బిల్ ను గతంలో ఏ విధంగా చేశారో అదే విధానాన్ని అనుసరించారు. ఏప్రిల్ నెల బిల్ లో మాత్రం డైనమిక్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించారు. దీని వలన వినియోగదారుడికి మంచే జరుగుతుందని హోంమంత్రి తెలిపారు.