కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

Mar 2, 2021, 7:09 PM IST


విజయవాడ: మూడవ దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులు కూడా మంగళవారం వ్యాక్సిన్  తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. అసలు ఇంజక్షన్ తీసుకున్నట్టే లేదని తెలిపారు.  వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నానని... ప్రజలు కూడా ఎలాంటి అపోహలను నమ్మకుండా వాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు.  రెండో డోసు మార్చ్ 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు.