ఏపీకి నూతన గవర్నర్ జస్టిస్ నజీర్... ఘనస్వాగతం పలికిన సీఎం జగన్

Feb 23, 2023, 11:38 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. విమానం దిగగానే జస్టిస్ నజీర్ కు పుష్ఫగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు జగన్. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులను నూతన గవర్నర్ కు పరిచయం చేసారు జగన్. ఆ తర్వాత గవర్నర్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నూతన గవర్నర్, సీఎం పాల్గొన్నారు. రేపు(శుక్రవారం) ఏపీ గవర్నర్ గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.