కరోనా వైరస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది..భయంలేదు...

Jan 28, 2020, 7:33 PM IST

రోనా వైరస్ మీద ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. వీటికోసం బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఐదు పడకలతో కూడిన ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు.