అమరావతిలో ఘనంగా అమరేశ్వర స్వామి రధోత్సవం

Feb 24, 2020, 6:13 PM IST

అమరావతిలో  శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వార్ల దివ్య రధోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పుర వీధుల్లో జరిగిన స్వామి వారి ఊరేగింపులో భక్తుల కోలాహలంతో జనసంద్రంగా మారింది. అధికసంఖ్యలో విచ్చేసిన భక్తులు అమరావతి పుణ్య క్షేత్రం దర్శించి తరించారు. రైతుల నిరసనల మధ్యనే రధోత్సవంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఎంపి నందిగం సురేష్ , ముఖ్య నేతలు పాల్గొన్నారు.