Jan 13, 2020, 10:24 AM IST
అమరావతి ఆందోళనలు 27 వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు కూడా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లో ఉంది. రైతులు, మహిళలపై లాఠీ ఛార్జ్ చేసినందుకు కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు పోలీసులకి నీళ్లు, టిఫిన్, భోజనం అమ్మకాలు నిలిపివేశారు. ఇక యువకులు గ్రామాల్లో పంచాయితీ బల్లాలపై పోలీసులు కూర్చోకుండా మడ్డి, ఆయిల్ పూసి తమ నిరసన తెలిపారు.