తెలంగాణ కంటే తక్కు రేట్ల వల్ల.. ఏపీ ఆయిల్ ఫాం రైతు నష్టపోతున్నాడు.. కన్నబాబు

May 28, 2020, 1:46 PM IST

అమరావతి, సచివాలయంలో ఆయిల్ పామ్ ధర నిర్ణయికరణ పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతేక కార్యదర్శి డాక్టర్ పూనమ్ మాలకొండయ్యతో పాటు మిగతా అధికారులు, ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ రైతులు నష్టపోకుండా ఆయా కంపెనీల ప్రతనిధులతో చర్చించి తగిన ధరను నిర్ణయించాలని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేశించారని కన్నబాబు తెలిపారు. తెలంగాణకంటే తక్కువ రేటు ఇవ్వడం వల్ల రైతులు నష్టపోతున్నారని అలా కాకుండా చూడాలని అన్నారు.