అమరావతికి జగన్ టోకరా: 3 రాజధానుల గందరగోళం

Dec 18, 2019, 5:36 PM IST

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అని జగన్ నిన్న అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఇక అప్పటి నుండి మొదలు. అమరావతి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని మరీ నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఇలా మూడు రాజధానుల వెనుక ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? ప్రభుత్వం ఇలా ప్రకటన చేయడానికి వెల్లడించిన కారణాలేంటి? ఈ నిర్ణయం సహేతుకమైనదేనా అనే విషయాన్ని తెలుసుకుందాము.