తాజాగా ఆయనను అరెస్టు చేయాలని వెళ్లిన పోలీసులకు మోహన్ బాబు కనిపించలేదు. ప్రస్తుతం మోహన్ బాబు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మోహన్ బాబు కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మోహన్ బాబు జాడ తెలియలేదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే మోహన్ బాబు పరారీలో లేరని.. ఆయన గచ్చిబౌలిలోని మంచు విష్ణు ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. జల్ పల్లి ఇంట్లో మనోజ్ తో పాటు ఆయన భార్య ఉండటంతో.. మళ్లీ గొడవలు కాకుండా.. సెటిల్ మెంట్ చేసుకునే వరకూ మంచు విష్ణు ఇంట్లో ఉండాలని మోహన్ బాబు డిసైడ్ అయ్యారట.