టాలీవుడ్ డ్రగ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు తరుణ్

By narsimha lodeFirst Published Sep 22, 2021, 10:20 AM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్  కేసు విచారణలో భాగంగా సినీ నటుడు తరుణ్ బుధవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో తరుణ్ నిర్వహించిన పబ్ పై ఆరోపణలు వచ్చాయి.  కెల్విన్ తో ఆర్ధిక సంబంధాలపై కూడ ఈడీ అధికారులు విచారణ నిర్వహించనున్నారు.

హైదరాబాద్:  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (tollywood drug case) సినీ నటుడు తరుణ్ (tarun) బుధవారం నాడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.టాలీవుడ్ డ్రగ్స్  కేసులో ఇప్పటికే 12 మంది సినీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సినీ నటులు తమ బ్యాంకు ఖాతాలతో విచారణకు హాజరు కావాలని  ఈడీ ఆదేశించింది. బ్యాంకు స్టేట్‌మెంట్లతో తరుణ్ ఈడీ అధికారుల వద్దకు చేరుకొన్నారు.

 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు తరుణ్ బుధవారం నాడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.టాలీవుడ్ డ్రగ్స్ ఇప్పటికే 12 మంది సినీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సినీ నటులు తమ బ్యాంకు ఖాతాలతో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. pic.twitter.com/gGGSHW7gYi

— Asianetnews Telugu (@AsianetNewsTL)

2017లో ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారించింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించిన  ఛార్జీషీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మదగినవిగా లేవని పేర్కొంది.అయితే ఎక్సైజ్ శాఖ  నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్ల:ఘించారని ఈడీ గుర్తించారు.

సినీ నటుడు నవదీప్   యాజమాన్యంలోని ఎఫ్ కేఫే లాంజ్ లో నిర్వహించిన పార్టీలతో పాటు కెల్విన్ తో సంబంధాలపై ఈడీ అధికారులు  విచారణ నిర్వహించనున్నారు.తరుణ్ గతంలో ఓ పబ్ ను నడిపాడు.ఈ పబ్ పై  ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై కూడ ఈడీ అధికారులు విచారించనున్నారు.


 

click me!