బీజేపీ ఆదేశాల మేరకే తెలంగాణ కాంగ్రెస్ పని చేస్తోంది - కేటీఆర్

Published : Jan 18, 2024, 04:17 PM IST
బీజేపీ ఆదేశాల మేరకే తెలంగాణ కాంగ్రెస్ పని చేస్తోంది - కేటీఆర్

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (telangana congress government)పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు చేశారు. బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీ (Adani)తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు.

బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో అదానీతో పోరాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోందని ప్రశ్నించారు.

లిక్కర్ పాలసీ స్కామ్ లో కేసులో నిందితుడిని కాదు.. మరెందుకు సమన్లు పంపారు - ఈడీతో కేజ్రీవాల్

మోడీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అంటారని, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ, అదానీ ఒక్కటే అని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ లో ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది అవకాశవాద, నీచ స్థాయి రాజకీయమని ఆరోపించారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో పలు వ్యాపారాలలో రూ.12400 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.

అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ రకాలుంటాయా ? - బండి సంజయ్

కాంగ్రెస్ చేసిన మొత్తం వాగ్దానాల సంఖ్య 420 అని కేటీఆర్ అన్నారు. వాటి గురించి ప్రజలకు, అధికార పార్టీకి గుర్తు చేయడం తమ పార్టీ బాధ్యత అని తెలిపారు. కాగా.. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు ఎంవోయూలను కొన్ని సంవత్సరాల కోసం మార్చుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House