హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర అమ్మాయిలతో వ్యభిచారం...బ్రోతల్ హౌస్ పై పోలీసుల దాడి

By Arun Kumar PFirst Published Sep 27, 2018, 6:34 PM IST
Highlights

హైదరాబాద్ లో నడిబొడ్డున ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో నిర్వహిస్తున్న ఓ  వ్యభిచార గృహంపై టాస్క్ పోర్స్ పోలీసులు ఇవాళ దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ బ్రోతల్ హౌస్ పై దాడిచేసిన పోలీసులు ఓ నిర్వహకుడు, విటుడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతిని ఈ బ్రోతల్ హౌస్ నుండి కాపాడారు.

హైదరాబాద్ లో నడిబొడ్డున ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో నిర్వహిస్తున్న ఓ  వ్యభిచార గృహంపై టాస్క్ పోర్స్ పోలీసులు ఇవాళ దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ బ్రోతల్ హౌస్ పై దాడిచేసిన పోలీసులు ఓ నిర్వహకుడు, విటుడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతిని ఈ బ్రోతల్ హౌస్ నుండి కాపాడారు.

అమీర్ పేట సమీపంలోని ఎస్ఆర్ నగర్ రవికుమార్ అనే వ్యక్తి ఓ ఇంటిని 15వేలకు అద్దెకు తీసుకున్నాడు. అందులో గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడిచేశారు. పోలీసులు ఈ వ్యభిచార గృహం నుండి  మూడు మొబైల్ పోన్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకుడు రవికుమార్, విటుడు క్రిష్ణ సాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. 

వ్యభిచార గృహ నిర్వహకుడి గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి నుండి గత సంవత్సరం నిందితుడు రవికుమార్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే అతడి విలాస జీవితానికి సంపాదన సరిపోకపోవడంతో ఈ నీచపు వృత్తిని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ఎస్ఆర్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. 

అయితే ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు తాజాగా ఆ ఇంటిపై దాడిచేశారు.  పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యవతిని నిందితుల నుండి పోలీసులు కాపాడారు.

click me!