Jan 14, 2019, 10:35 AM IST
ఓ ఆయిల్ వ్యాపారి తన కుటుంబంతో కలిసి కామాటిపుర ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండేళ్లక్రితం ఓరోజు కుటుంబసభ్యులు పనికి వెళ్లిన తర్వాత బాలిక ఒంటరిగా ఉండడం చూసి సమీప బంధువైన రాజేశ్ (25) ఇంట్లోకి వచ్చాడు. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు.
ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ వీడియోను స్నేహితులు అభిజిత్ కౌశిక్, శుభమ్ వ్యాస్లకు షేర్ చేశాడు. తర్వాత ఆ వీడియో షేరవుతూ 10మందికి చేరింది. వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ రాజేశ్, అబిజిత్, శుభమ్తో పాటు మిగతా 8మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు డిసెంబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు.