బంజారాహిల్స్ లో స్పా ముసుగులో వ్యభిచారం.. 14మంది యువతులను రక్షించిన పోలీసులు..

By SumaBala BukkaFirst Published Aug 29, 2023, 2:27 PM IST
Highlights

హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 14మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని రెండు సెంటర్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.

ఇతర ప్రాంతాలనుంచి కొంతమంది యువతులను తీసుకొచ్చి మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిమీద కేసులు నమోదు చేశారు. 14మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. వీరితో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు. 

ఆ నియోజకవర్గంలో వార్ వన్‌సైడే.. ఆమె గెలిచితీరుతుంది.. మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చిన యువతులకు ఒక్కో యువతికి వారానికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఇలా డబ్బులు ఇస్తూ వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అంగీకరించారు. 
 

click me!