మైనర్ బాలికకే కాదు తల్లికీ నగ్న ఫోటోలు, వీడియోలు... జగిత్యాలలో కీచక టీచర్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Jan 26, 2022, 10:05 AM IST
Highlights

విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే బుద్దితప్పి మైనర్ బాలికపై వేధింపులకు దిగి అరెస్టయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: అతడో స్కూల్ టీచర్. విద్యార్థులు తప్పులు చేస్తే బుద్దిచెప్పాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో వున్న అతడే బుద్ది తప్పాడు. ఓ మైనర్ బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫోటోలు పంపించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన రేగొండ వెంకట సాయి(31) ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణుల ఫోన్ నెంబర్లు సేకరించిన అతడు వారితో అసభ్యకరంగా చాట్ చేసేవాడు. ఈ విషయం విద్యార్థిణుల తల్లిదండ్రులకు తెలిసి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. దీంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు. 

ఇలా తన నీచపు ప్రవర్తనతో ఉద్యోగాన్ని కోల్పోయినా అతడి బుద్ది మాత్రం మారలేదు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన వెంకటసాయి ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సేకరించాడు. బాలికతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఇలా కొంతకాలం ఛాటింగ్ సాగిన తర్వాత తనను ప్రేమిస్తున్నానని బాలికకు వెంకటసాయి చెప్పాడు. దీంతో బాలిక అతడి మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేసింది.  దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు దారుణంగా వ్యవహరించాడు. 

బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫోటోలు, వీడియోలు పంపించి వేధింపులకు దిగాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు వెంకటసాయిని అరెస్ట్ చేసారు. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇలాగే చిన్నారులపై లైంగిక దాడికి దిగిన ఓ నీచుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.  కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల పాలిట కీచకుడిలా మారి నీచంగా ప్రవర్తిస్తూ ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న హెడ్ మాస్టర్ ఉదంతం ఒకటి బయటపడింది.  .

మైసూరు జిల్లా హెచ్ డీ కోటె తాలూకాలోని ఓ స్కూల్ విద్యార్థిణితో హెడ్ మాస్టర్ రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. స్థానికంగానే కాదు మైసూరు జిల్లా వ్యాప్తంగా ఆ వీడియో వైరల్ కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

విద్యార్థిణికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్న నీచుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి దారుణాల గురించి వింటుంటే తమ పిల్లలను బయటకు పంపాలంటే భయంగా వుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్రంలో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, చిన్నారుల రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


 

click me!