ఎల్బీనగర్ లాడ్జ్ లో వ్యభిచార ముఠా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

By AN TeluguFirst Published Mar 18, 2021, 10:40 AM IST
Highlights

హైదరాబాద్ లోని ఓ లాడ్జ్ లో అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న సాయిదుర్గా లాడ్జ్ లో విదేశీ యువతులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. 

హైదరాబాద్ లోని ఓ లాడ్జ్ లో అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న సాయిదుర్గా లాడ్జ్ లో విదేశీ యువతులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. 

ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ టీమ్, ఎల్ బీనగర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న సాయిదుర్గా లాడ్జ్ యజమాని దేశినేని వెంకటేశ్వరరావు(52)ను అరెస్ట్ చేశారు. లాడ్జ్ కు నెలకు రూ. 75వేలు అద్దెకడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపరు. 

దేశినేని వెంకటేశ్వరరావుతో పాటు వెస్ట్ బెంగాల్ కు చెందిన సాకిజాన్ కాటన్ అలియాస్ దీపిక అలియాస్ రేష్మ (30), పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తన్న మండ్ల అవినాష్ (32), మీర్ పేటకు చెందిన గుగులోతు సుజాత (27)లను అరెస్టు చేశారు. 

అలాగే విటులు కుమావత్ పంచారాం (38), సిర్ర మనీష్ (25), ఆవులదొడ్డి మధు (30), మధ్యప్రదేశ్ కు చెందిన వికాస్‌ కుమార్‌సాకేత్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

లాడ్జ్ లో పట్టుబడిన నలుగురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు. బంగ్లాదేశ్‌తో పాటు, దేశంలోని పశ్చిమ బెంగాల్, ఏపీల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

click me!