హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. !

By SumaBala BukkaFirst Published Jan 6, 2022, 11:04 AM IST
Highlights

వీరిదగ్గరున్న Cocaine, heroin, మత్తు పదార్థాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 

హైదరాబాద్‌లో భారీగా drugs పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న Mumbai gangను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ను New Year celebrations కోసం తీసుకొచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 

వీరిదగ్గరున్న Cocaine, heroin, మత్తు పదార్థాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 

ఇదిలా ఉండగా, సంచలనం సృష్టించిన Tollywood Drugs Case వ్యవహారంలో Enforcement Directorate (ఈడీ) చేపట్టిన దర్యాప్తు తుస్సు మంది. మత్తుమందుల దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.  వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ఆరంభించే అవకాశం ఉంది.

2017లో Excise  Departmentనమోదు చేసిన కేసులతో టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది, సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలు లభించలేదు.  ఇప్పుడు ఈడీ దర్యాప్తు కూడా ఇలాగే ముగిసిపోనుంది. నాలుగేళ్ల క్రితం అంటే 2017 జూలైలో ఆబ్కారీ శాఖ అధికారులు Kelvin Markerans అనే వ్యక్తిని  అరెస్టు చేసి అతడి నుంచి మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో Telugu film industryకి చెందిన అనేకమందికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అతను వెల్లడించారు. దాంతో కలకలం రేగింది. 

పిల్లల కోసం ‘గర్భిణి’ నంటూ వింత నాటకం.. కాన్పు సమయం దగ్గరపడడంతో...

దర్యాప్తులో భాగంగా అప్పుడే ఆబ్కారీ శాఖ సంచాలకులు Akun Sabharwal ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడుతున్నదీ, లేనిదీ  శాస్త్రీయంగా నిర్ధారించేందుకు  వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు తోపాటు సాక్షులను విచారించారు. దాదాపు మూడేళ్ళ పాటు దర్యాప్తు చేసినా మత్తు మందుల వాడకం పై ప్రాథమిక ఆధారాలు లభించలేదు. ఆబ్కారీ శాఖ  దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు తెరపైకి వచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో మళ్ళీ కొత్తగా గత ఆగస్టులో కేసు నమోదు చేశారు.  డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు.  దీంట్లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ Puri Jagannath, Ravi Teja, Rana, Charmi, Rakul Preet Singh వంటి 12 మందిని విచారించారు.

వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకూ కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసును మూసివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. 

click me!