భారత్, వెస్టిండీస్ మ్యాచ్.. ఇది క్రికెట్, రన్నింగ్ రేస్ కాదు

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 1:52 PM IST
Highlights

కోల్ కతా వేధికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ.. దానిని ఛేదించడానికి టీం ఇండియా బాగానే కష్టపడింది


కోల్ కతా వేధికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ.. దానిని ఛేదించడానికి టీం ఇండియా బాగానే కష్టపడింది. ఈ మ్యాచ్ గెలుపోటములు పక్కనపెడితే.. వెస్టిండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

మొదట టాస్ గెలిచిన కెప్టెన్  రోహిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు. హోప్‌ ఆడిన షాట్‌ను ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ అందుకున్నాడు. 

కానీ అతను విసిరిన త్రో కీపర్‌ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్‌ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు ఇద్దరూ  ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్‌ చేయడంతో హోప్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 

ఇలా ఇద్దరూ ఒకేవైపు పరిగెత్తడంతో సోషల్ మీడియాలో వెస్టిండీస్ క్రికెటర్లపై జోకులు వేస్తున్నారు. రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ అంటూ.. కొందరు ఛలోక్తులు విసురుతున్నారు. 

click me!