అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ 4 రోజుల భారత పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
| Delhi: Vice President of the United States, JD Vance receives ceremonial Guard of Honour as he arrives at Palam airport for his first official visit to India.
He will meet PM Modi later today. pic.twitter.com/Xzx8P85lvz
— ANI (@ANI)
పాలం విమానాశ్రయంలో జె.డి. వాన్స్ కు ఘన స్వాగతం లభించింది. ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
| Delhi: Vice President of the United States, JD Vance receives ceremonial Guard of Honour as he arrives at Palam airport for his first official visit to India. pic.twitter.com/eIuHmnG8kM
— ANI (@ANI)
వాన్స్ తో పాటు ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు, అమెరికా ఉన్నతాధికారులు భారత్ కు వచ్చారు.
ట్రంప్ పరిపాలనలో ఇది కీలకమైన దౌత్య పర్యటనగా చూస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
| Delhi: US Vice President JD Vance arrives at Palam airport for his first official visit to India.
He is being accompanied by Second Lady Usha Vance, their children, and senior members of the US Administration. He will meet PM Modi today. pic.twitter.com/saB6BgrmI4
— ANI (@ANI)
వాన్స్ తన పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ స్థిరత్వం వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జె.డి. వాన్స్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి భారత్ కు వచ్చారు. ఇది వాన్స్ తొలి భారత పర్యటన.
వాన్స్ ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసంలో వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. ఆర్థిక, వాణిజ్య, రక్షణ సహకారంపై చర్చించనున్నారు.
అధికారిక సమావేశాల తర్వాత వాన్స్ కుటుంబం జైపూర్, ఆగ్రా నగరాలను సందర్శించనుంది. మంగళవారం జైపూర్ కు వెళ్తారు. 23న ఆగ్రాను సందర్శిస్తారు.
తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలనియా ట్రంప్ తో కలిసి తాజ్ మహల్ ను సందర్శించారు.
జె.డి. వాన్స్ తన కుటుంబంతో భారత్ కు రావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని వాడలూరు గ్రామంలో సందడి నెలకొంది. ఉషా వాన్స్ స్వగ్రామం వాడలూరు. వాన్స్ దంపతులు తమ గ్రామానికి వస్తారని గ్రామస్తులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 24న ఉదయం 6:40 గంటలకు వాన్స్ తిరిగి అమెరికాకు బయలుదేరుతారు. ఈ పర్యటన ద్వారా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు.
గత గురువారం జరిగిన వారపు మీడియా సమావేశంలో జైస్వాల్ మాట్లాడుతూ.. "అమెరికాతో మనకు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇలాంటి భాగస్వామ్యం ఉన్నప్పుడు అన్ని కీలక అంశాలపై చర్చిస్తాం" అని అన్నారు.
"ద్విపార్శ్వ వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
వాన్స్ పర్యటన ద్వారా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని జైస్వాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జె.డి. వాన్స్ తన కుటుంబంతో కలిసి మూడు రోజుల పాటు ఇటలీలో పర్యటించారు. అక్కడ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.
శుక్రవారం ఇటలీకి చేరుకున్న వాన్స్.. ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. శనివారం వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ తో సమావేశమయ్యారు.
ఈస్టర్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ అయిన తర్వాత వాన్స్ తన పర్యటనను ముగించారు.