జాబ్స్ ఇప్పిస్తానని ట్రాప్.. యువతులతో సెక్స్ లో పాల్గొని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. బెంగళూరు టెక్కీ అరెస్టు

By Asianet NewsFirst Published Feb 4, 2023, 12:12 PM IST
Highlights

అతడో టెక్కీ. జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అమాయక యువతులే అతడి టార్గెట్. వారిని సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసి, జాబ్స్ ఇప్పిస్తానని పలు చోట్లకు రప్పించి, వారితో సెక్స్ లో పాల్గొనేవాడు. వాటితో బ్లాక్ బెయిల్ చేసేవాడు. 

అతడో టెక్కీ.. సోషల్ మీడియా ద్వారా యువతులను ట్రాప్ చేయడం, జాబ్స్ ఇప్పిస్తానని వారిని పలు ప్రాంతాలకు రప్పించి బలవంతంగా సెక్స్ లో పాల్గొని, వీడియోలు రికార్డు చేస్తున్న టెక్కీని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరులోని కోరమంగళ వాసి డిల్లీ ప్రసాద్‌గా గుర్తించారు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఐదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కలిగి ఉన్నాడు.

వైరల్ వీడియో : ఈ కుక్క రాజసం చూడండి.. కదులుతున్న కారు మీద కూడా ఎంత ఠీవీగా కూర్చుందో...

అతడు మహిళలతో చాటింగ్ చేసి తనకు పరిచయాలున్న కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అతడి మాటలు నమ్మిన మహిళలు చెప్పిన చోటికి వెళ్లేవారు. తరువాత ఓయో హోటళ్లలో ఎక్కువగా రూమ్‌లు బుక్ చేసేవాడు. అక్కడికి వెళ్లిన తరువాత వారితో బలవంతంగా శృంగారంలో పాల్గొనేవాడు. ఆ సమయంలో ఆ దుశ్చర్యను వీడియో తీసేవాడు.

మూఢ నమ్మకానికి పసికందు బలి.. న్యూమోనియా సోకిందని 51 సార్లు కడుపుపై వేడి ఇనుప రాడ్ తో పొడవడంతో చిన్నారి మృతి..

ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇలా పది మందికి పైగా మహిళలను అతడు ట్రాప్ చేశాడు. ప్రసాద్ వద్ద 10 మందికి పైగా యువతుల వీడియోలు ఉన్నాయని బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అయితే అతడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతులను ఎక్కువగా ట్రాప్ చేశాడు. ప్రసాద్‌పై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గత రెండేళ్లుగా మహిళలను ట్రాప్ చేస్తున్నాడని విచారణలో తేలింది.
 

click me!