ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల వల్ల మరణాలు ఎన్నో తెలుసా...?

Ashok Kumar   | Asianet News
Published : Dec 28, 2019, 04:36 PM ISTUpdated : Dec 28, 2019, 04:39 PM IST
ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల వల్ల మరణాలు ఎన్నో తెలుసా...?

సారాంశం

1990-1995 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 500 కి పైగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ఐదేళ్ళలో సుమారు 2,400 మంది మరణించగా సుమారు 4,300 మంది గాయపడ్డారు. ఒక దశాబ్దం తరువాత 2013-2018 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 110 ప్రమాదాలు జరిగాయి.

న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే 2019 లో రైలు ప్రమాదాల్లో ప్రయాణీకుల మరణాలను నమోదు చేసింది. ఇది జాతీయ రవాణాదారుడికి  సురక్షితమైన సంవత్సరంగా గుర్తింపు పొందిందని అధికారిక సమాచారం.గత సంవత్సరంలో రైల్వే  మరణాలను చూసుకుంటే, 12 నెలల్లో ప్రయాణీకుల మరణాలు సంభవించలేదని డేటా వెల్లడించింది.

2018-19లో రైల్వేలో 16 మరణాలు, 2017-2018లో 28 మరణాలు మరియు 2016-2017లో 195 మరణాలు నమోదయ్యాయి.1990-1995 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 500 కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఆ ఐదేళ్ళలో సుమారు 2,400 మంది మరణించారు ఇంకా 4,300 మంది గాయపడ్డారు. ఒక దశాబ్దం తరువాత 2013-2018 మధ్య ప్రతి సంవత్సరం సగటున 110 ప్రమాదాలు జరిగాయి. పిటిఐ వద్ద లభించిన సమాచారం ప్రకారం సుమారు 990 మంది  మరణించగా 1,500 మంది గాయపడ్డారు.

also read  అఫైర్: టీవీ నటి భర్త ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య


రైల్వేలో  రైలు ప్రమాదాలు , పట్టాలు తప్పడం, అగ్నిప్రమాదం, లెవల్ క్రాసింగ్ ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగేవి. రైల్వే లో రైలు  కారణంగా జరిగిన ప్రమాదాలను లెక్కించగా, మరణించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రమాదాలలో రైల్వే ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది, ఇతరులు మరణించారు.

రైల్వే  ప్రమాద గణాంకాలను క్రమంగా మెరుగుపరిచింది. 2017-2018లో మార్చి వరకు 73 ప్రమాదాలు జరిగాయి. మొదటిసారి రైల్వే రెండు అంకెల సంఖ్యను సాధించగా 2018 లో ఏప్రిల్, డిసెంబర్ 15 మధ్య  45 మరణించారు.2014-15లో  లెవల్ క్రాసింగ్లలో 50 ప్రమాదాలు జరిగాయి, 2016-17లో 20, 2017-18లో 10, 2018-19లో  3, 2019-20లో సున్నా.

ఈ ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కూడా కొన్నేళ్లుగా తగ్గింది. 2016-17లో అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పడంతో సహా వివిధ రైలు ప్రమాదాల్లో 365 మంది గాయపడ్డారు. ఇందులో 44 మంది గాయపడ్డారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో 68 మంది గాయపడ్డారు.


2017-18లో 195 మంది గాయపడ్డారు, ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలిలో జరిగిన పెద్ద ప్రమాదంలో 97 మంది గాయపడ్డారు. కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినప్పుడు 23 మంది మరణించారు. 2018-2019లో 106 మంది గాయపడ్డారు.అమృత్సర్‌లో దసరా పండుగను చూస్తూ ట్రాక్‌లపై నిలబడి ఉన్న ప్రజల గుంపులోకి రైలు దూసుకెళ్లి 59 మంది మృతి చెందగా, సుమారు 100 మంది గాయపడ్డారు.


అయితే, ఈ సంఘటన రైలు ప్రమాదాల కిందకు రాదని రైల్వే పేర్కొంది.2019-20లో ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. కాని ఇప్పటివరకు గూడ్స్ రైళ్ళలో కొన్ని పట్టాలు తప్పాయి. గత 12 నెలల్లో 33 మంది ప్రయాణికులు గాయపడగా కొద్దిమంది ఉద్యోగుల మరణాలు తప్ప, ప్రయాణీకుల మరణాలు ఏవీ జరగలేదు.

also read బస్సులో బాలికపై హెల్పర్ అత్యాచారం: డ్రైవర్ కాపలా

ఈ సంవత్సరం సంభవించిన కొన్ని రైలు ప్రమాదాలలో సీమంచల్ ఎక్స్‌ప్రెస్ 11 బోగీలు పట్టాలు తప్పడం, ఛప్రా-సూరత్ తప్తి గంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, హైదరాబాద్ దక్కన్-న్యూ ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారులో అగ్ని ప్రమాదం ఈ రెండు రైలు ప్రమాదంలో ఉన్నాయి. తెలంగాణలో   రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో ఇందులో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు అయితే మోటర్మాన్ మరణించారు.


గత సంవత్సరంలో చేపట్టిన చర్యల వల్ల 2019 లో ట్రాక్‌లపై సున్నా మరణాలు సాధించగలిగామని రైల్వే తెలిపింది. నిర్వహణ కోసం మెగా బ్లాక్‌లు, నిర్వహణలో ఆధునిక యంత్రాల వాడకం, అన్ని మ్యానుయాల్ స్థాయి క్రాసింగ్‌లను తొలగించడం, ఐసిఎఫ్ కోచ్‌లను ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో భర్తీ చేయడం, ట్రాక్ పునరుద్ధరణ, సిగ్నలింగ్ ఆధునీకరణ ఇంకా విటిని ఉన్నత అధికారులకు అధికారాన్ని అప్పగించడం ద్వారా సాధ్యమైంది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !