రాబర్ట్ వాద్రాకు కరోనా, ఐసోలేషన్‌లోకి ప్రియాంక: ఎన్నికల సభలు రద్దు

By narsimha lodeFirst Published Apr 2, 2021, 2:21 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కొద్ది రోజుల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు.

న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కొద్ది రోజుల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు.ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దీంతో ప్రియాంక గాంధీ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. 

 

ప్రియాంక గాంధీ కొద్ది రోజుల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దీంతో ప్రియాంక గాంధీ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. pic.twitter.com/j9Rrb9RxtL

— Asianetnews Telugu (@AsianetNewsTL)

కొంతకాలంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు  ప్రియాంక గాంధీ కొన్ని రోజుల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయాన్ని ఆమె ఆ వీడియోలో ప్రకటించారు.

ఇవాళ అసోం, రేపు తమిళనాడు, ఎల్లుండి కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే స్వీయ నిర్భంధంలోకి ప్రియాంకగాంధీ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికల ప్రచార సభలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది.ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆమె ఆ పార్టీ నేతలను కోరారు.


 

click me!